వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్-భారత్ల శిఖరాగ్ర చర్చలు
రాజమండ్రిః తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బ్రిడ్జిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో పదిమంది గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడి కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ధవళేశ్వరం బ్రిడ్జిపై నుంచి వెళుతున్న మెటడార్ వ్యాన్ అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్ ను డీకొన్నది. దీనితో వ్యాన్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. వ్యాన్ లో వున్న 14 మందిలో పదిమంది ఒక్కసారిగా నదిలో పడిపోయారు. చీకటి... భారీ వర్షం, నదిలో ప్రవాహం ఉదృతంగా వుండడంతో నదిలో పడిన వారి పరిస్థితి అర్థంకాకుండా వుంది. చివరికి గాలింపు చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది.
Comments
Story first published: Monday, July 16, 2001, 23:53 [IST]