స్టాలిన్ పి.ఎ. కుటుంబం ఆత్మహత్య
చెన్నయ్ః చెన్నయ్ మేయర్ స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడైన ఆయనపి.ఎం. కుటుంబం యావత్తు సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడింది. కరుణానిధి, స్టాలిన్ లఅరెస్టు అనంతరం పోలీసుల వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రమేష్ కుటుంబం చనిపోతూ రాసిన లేఖలోపేర్కొన్నది. ఈ సంఘటన చెన్నయ్ లో సంచలనం సృష్టించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, చెన్నయ్ మేయర్ స్టాలిన్ కు అన్నానగర్ రమేష్ వ్యక్తిగత సహాయకునిగా వున్నారు. ఒక వ్యాపార వేత్తను డిఎంకె నేతలు కిడ్నాప్ చేసిన కేసులో ఈయన కూడా నిందితుడుగా వున్నాడు. ఈ సంఘటనతో ఇప్పటికే అంతంత మాత్రంగా వున్న తమిళనాడు పోలీసుల పరువు బజారున పడింది.
అన్నానగర్ రమేష్ ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ ఆయన కుటుంబ సభ్యులువిషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
కేంద్ర
వైఖరిపై
కరుణ
సీరియస్ః
జయ
లలిత
ప్రభుత్వం
తమను
రాచి
రంపాన
పెడుతున్నా
కేంద్ర
ప్రభుత్వం
తగిన
రీతిలో
స్పందించడంలో
లేదని
తమిళనాడు
మాజీ
ముఖ్యమంత్రి
కరుణానిధి
వ్యాఖ్యానించారు.
పరిస్థితి
ఇదేవిధంగా
కొనసాగితే
కేంద్రంలోని
ఎన్డీఏ
ప్రభుత్వంతో
గల
సంబంధాలను
తిరిగి
పరిశీలించుకోవాల్సి
వుంటుందని
ఆయన
అన్నారు.
అయితే
ఇది
కేంద్రానికి
బెదిరింపు
కాదని
ఆయన
చెప్పారు.
కమిషన
నివేదిక
వచ్చే
వరకు
తనను
అక్రమంగాఅరెస్టు
చేసిన
తమిళనాడు
పోలీసులపై
చర్యతీసుకొనేందుకు
జయనిరాకరించడాన్ని
కరుణ
తప్పు
పట్టార.
కోయంబత్తూరుపేలుళ్ళ
కేసుతో
కమిషన్
నివేదిక
రాకముందే
తాను
దోషులపై
చర్య
తీసుకున్నవిషయాన్ని
కరుణానిధి
ఈ
సందర్భంగా
గుర్తు
చేసుకున్నారు.