వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భవిష్యత్ చర్చలకు ఆగ్రా పునాది
ఇస్లామాబాద్: ఆగ్రా శిఖరాగ్ర సమావేశం విఫలమైందనే వాదనలను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ సత్తార్ తీవ్రంగా ఖండించారు. ఆగ్రా శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని వాజ్పేయి, పాకిస్తాన్ నేత ముషారఫ్ ఉమ్మడి ప్రకటనకు రంగం దాదాపు సిద్ధమైన తర్వాత ఆఖరు నిమిషంలో అవాంతరాల వల్ల ప్రకటనకు విఘాతం కలిగిందని ఆయన చెప్పారు.
అయితే ఆగ్రా శిఖరాగ్ర సభ వల్ల ఉభయ దేశాల మధ్య భవిష్యత్ చర్చలకు ఉపయోగపడగల సుహృద్భావ వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో ఉభయ దేశాల మధ్య జరిగే చర్చలకు ఆగ్రా శిఖరాగ్రం పునాది కాగలదని ఆయన చెప్పారు. ఉభయ దేశాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణమైన ఫలితాలను సాధించేవరకు చర్చల పరంపరను ఉభయదేశాల నేతలు కొనసాగించగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
- ఆగ్రాశిఖరాగ్రం
Story first published: Tuesday, July 17, 2001, 23:53 [IST]