ఆగ్రా శిఖరాగ్రం విఫలం
ఆగ్రాః భారత-పాక్ దేశాల మధ్య శాంతి స్థాపన లక్ష్యంగా ఆగ్రా లో ఆది, సోమ వారాలలో జరిగిన శిఖరాగ్ర సమావేశం నిష్ఫలంగా ముగిసింది. కాశ్మీర్ ను కనీసం ఒక సమస్యగా గుర్తించాలంటూ పాక్ అధ్యక్షుడు ముషారఫ్ మంకు పట్టు పట్టడం, సరిహద్దు అవతల నుంచి మా భూభాగంలో చిచ్చు రేపడం గురించి చర్చిద్దామంటూ వాజ్పేయి తేల్చి చెప్పడంతో చివరకు సోమవారం అర్థరాత్రి ఎటువంటి ఫలితం తేలకుండానే శిఖరాగ్రం ముగిసింది.
ఉభయదేశాలు ఆగ్రా శిఖరాగ్రంపై సంయుక్త ప్రకటన కూడా జారీ చేయలేక పోయాయి. సంయుక్త ప్రకటనను ఖరారు చేయడంలో రాత్రి 11 గంటల వరకు కుస్తీ పట్టిన రెండు దేశాల దౌత్య అధికారులు చివరకు సంయుక్త ప్రకటన లేదంటూ తేల్చి చెప్పారు. దీనితో ఆగ్రా శిఖరాగ్రం చతికిల పడందనేవిషయం తేటతెల్లం అయింది. దీనితో సోమవారం అర్థరాత్రి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ వట్టి చేతులతో ఇస్లామాబాద్ తిరిగి వెళ్ళారు.
శిఖరాగ్రం విఫలం కావడానికి భారత్ మొండి వైఖరే కారణమంటూ పాక్ సహజంగానే అభాండం వేసింది. భారత్ మాత్రం ఓ మహా ప్రస్థానం మొదలైంది.... అయితే గమ్యాన్ని చేరడంలోవిఫలం అయిందని వ్యాఖ్యానించింది. అయితే భారత్-పాకిస్తాన్ లు ఉపఖండంలో శాంతి స్థాపన దిశగా సోమవారం సాయంత్రం దాదాపు ఓ ఒప్పందానికి వచ్చాయని, అయితే ఏదో అదృశ్య హస్తం రెండు దేశాల మధ్య శాంతిస్థాపన యత్నాలను దెబ్బతీసిందనేవిమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ
అదృశ్య
హస్తం
అమెరికా
తప్ప
మరో
దేశం
కాదనే
వ్యాఖ్యలు
కూడావినవస్తున్నాయి.
ఆసియా
ఉపఖండంలో
శాంతి
నెలకొంటే
తమను
లెక్క
చేసే
వారుండరనేది
అమెరికా
అలోచన
అని
దౌత్య
ప్రముఖులు
వ్యాఖ్యానిస్తున్నారు.
చైనా-రష్యాలు
దగ్గర
కావడంతో
భయపడిన
అమెరికా
శాంతి
ఒప్పందానికి
చివరలో
అడ్డుపుల్ల
వేసిందనేవిమర్శలు
కూడా
వినిపిస్తున్నాయి.
- ఆగ్రాశిఖరాగ్రం