వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిఖరాగ్రంపై ప్రధాని అఖిలపక్షం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అధినేత ముషారఫ్‌తో ఆగ్రాలో జరిపిన శిఖరాగ్ర చర్చలపై గురువారం నాడు మరో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆగ్రా శిఖరాగ్ర చర్చల వివరాలను ప్రధాని ప్రతిపక్ష పార్టీలకు వివరిస్తారు.

బుధవారం నాడు కేంద్ర కేబినెట్‌ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్‌మహాజన్‌ ఈ విషయం చెప్పారు. కేబినెట్‌ సమావేశంలో కూడా ఆగ్రా పై చర్చ జరిగిందని అంటున్నారు. ప్రధాని ఆగ్రా సదస్సు సందర్భంగా అవలంభించిన సరళిని మంత్రులంతా హర్షించారని తెలిసింది.

కేబినెట్‌ సమావేశం తర్వాత ఎన్‌డిఎ మిత్రపక్షాలతో కూడా ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు. ఆగ్రాలో ఏం జరిగిందనే విషయం విపక్షాలకు వివరించాల్సిన బాధ్యత తనపై వున్నదని ప్రధాని భావిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆగ్రా సదస్సుకు ముందు కూడా ప్రధాని వాజ్‌పేయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం విదితమే. బుధవారం నాటి కేబినెట్‌ సమావేశంలో ఒరిస్సా వరద బీభత్సం గురించి చర్చించినట్టు మహాజన్‌ చెప్పారు.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X