వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సాకు వందకోట్ల సాయం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరద బీభత్సంతో అతలాకుతలమైన ఒరిస్సాను ఆదుకునేందుకు తక్షణసాయంగా 200 కోట్ల రూపాయలు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ కేంద్రాన్ని కోరారు. బుధవారం నాడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ వరద తీవ్రతగురించి చర్చించిన ప్రధాని వాజ్‌పేయి తక్షణమే 100 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఈవిషయం కేంద్ర మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు. ఇదిలా వుండగా ఒరిస్సాలో మహానదితో సహా అన్ని ముఖ్యమైన నదులు మహోధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నదుల ప్రవాహం తాకిడికి అనేక చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయి.

అనేక గ్రామాలు మునిగిపోయాయి. బుధవారం నాటికి మృతుల సంఖ్య 35కు చేరింది. పదిజిల్లాల్లోని సుమారు 7200 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. 40 లక్షల మంది ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లోని ప్రజలకు ఆహారం సప్లయ్‌ చేసేందుకు, ప్రత్యామ్నాయ వసతి సౌకర్యాలు కల్పించడానికి ఒరిస్సా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X