వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నవంబర్లోగా ప్రధాని పాక్ యాత్ర
న్యూఢిల్లీ: ఆగ్రా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పాక్ యాత్రకు అందిన ఆహ్వానాన్ని భారత ప్రధాని వాజ్పేయి వచ్చే నవంబర్లోగా మన్నించే అవకాశం వున్నది. ఈ విషయం భారత సామాజిక శాస్త్రాల అధ్యయన మండలి డైరెక్టర్ సోంధీ చెప్పారు. ఆగ్రా శిఖరాగ్ర సభకు ముందుగా మండలి భారత్, పాకిస్తాన్లకు చెందిన సామాజిక శాస్త్రవేత్తలతో ఒక సమావేశాన్నినిర్వహించింది.
ఈసమావేశంలో ఉభయ దేశాల శాస్త్రవేత్తలు చేసిన సిఫారసులతో నివేదికను అందజేయడానికి ప్రధాని వాజ్పేయిని కలసినప్పుడు ఆయన తనకీ విషయం చెప్పారని సోంధీ అన్నారు. ప్రధాని ప్రత్యేక సలహాదారు బ్రజేష్ మిశ్రా కూడా వేరే సందర్భంలో తనతో చెప్పారని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహసంబంధాలను పెంచడానికి వీలుగా ఐసిఎస్ఎస్ఆర్ చేసిన సిఫారసులు పాక్ నేత ముషారఫ్కు ఎంతో నచ్చాయని ఆయన వెల్లడించారు.
- స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
Comments
Story first published: Wednesday, July 18, 2001, 23:53 [IST]