వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్‌లోగా ప్రధాని పాక్‌ యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆగ్రా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పాక్‌ యాత్రకు అందిన ఆహ్వానాన్ని భారత ప్రధాని వాజ్‌పేయి వచ్చే నవంబర్‌లోగా మన్నించే అవకాశం వున్నది. ఈ విషయం భారత సామాజిక శాస్త్రాల అధ్యయన మండలి డైరెక్టర్‌ సోంధీ చెప్పారు. ఆగ్రా శిఖరాగ్ర సభకు ముందుగా మండలి భారత్‌, పాకిస్తాన్‌లకు చెందిన సామాజిక శాస్త్రవేత్తలతో ఒక సమావేశాన్నినిర్వహించింది.

ఈసమావేశంలో ఉభయ దేశాల శాస్త్రవేత్తలు చేసిన సిఫారసులతో నివేదికను అందజేయడానికి ప్రధాని వాజ్‌పేయిని కలసినప్పుడు ఆయన తనకీ విషయం చెప్పారని సోంధీ అన్నారు. ప్రధాని ప్రత్యేక సలహాదారు బ్రజేష్‌ మిశ్రా కూడా వేరే సందర్భంలో తనతో చెప్పారని ఆయన అన్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య స్నేహసంబంధాలను పెంచడానికి వీలుగా ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ చేసిన సిఫారసులు పాక్‌ నేత ముషారఫ్‌కు ఎంతో నచ్చాయని ఆయన వెల్లడించారు.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X