అధికార పార్టీపై ప్రజల రోత
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీ విధానాల వల్ల ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో వున్న తీవ్రమైన వ్యతిరేకత జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాల్లో బయటపడిందని కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పారు. రోజుకు కోటి రూపాయలు ప్రచారం మీద ఖర్చుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పలేకపోయామని వాపోవడాన్ని వైఎస్ ఎగతాళి చేశారు.
ముఖ్యమంత్రి చేసింది అభివృద్ధి కాదని ప్రచార పటాటోపంతో తమను వంచించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదనే విషయం ప్రజలు గ్రహించారని అందుకే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల విజయాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సోపానంగా మల్చుకుంటామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పరాజయాన్ని ఎదుర్కున్న తెలుగుదేశం జెడ్పి చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి ప్రతిపక్ష సభ్యలను పదవులు, డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించే ప్రమాదం వున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అధికార
పార్టీ
అనైతిక
విధానాలకు
పాల్పడితే
కాంగ్రెస్
సహించదని
వీధి
పోరాటాలకు
దిగుతుందని
ఆయన
హెచ్చరించారు.
ఇప్పటికే
తెలుగుదేశం
పార్టీకి
ప్రజల్లో
తలెత్తుకోలేని
అవమానం
ఎదురయిందని
ఇంకా
అవమానాలను
కొని
తెచ్చుకోవద్దని
ఆయన
సూచించారు.
కాంగ్రెస్
రాష్ట్రంలో
అధికారంలో
వచ్చిన
మొదటి
రోజే
ఉచిత
విద్యుత్ను
ప్రకటిస్తామని
ఆయన
చెప్పారు.
ఉచిత
విద్యుత్
ఎలా
సాధ్యమో
తాము
రుజువు
చేస్తామని
ఆయన
చెప్పారు.
- స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా