వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగ్యనగర్‌ఎక్స్‌ప్రెస్‌డీ-నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃభాగ్యనగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ డీకొని నలుగురు గ్యాంగ్‌ మెన్‌ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న భాగ్యనగర్‌ఎక్స్‌ ప్రెస్‌ గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌ పై నడుస్తున్న ఆరుగురు గ్యాంగ్‌ మెన్‌ ను డీకొంది. దీనితో వారిలోని

నలుగురు గ్యాంగ్‌ మెన్‌ అక్కడికి అక్కడే మరణించారు.మిగిలిన ఇద్దరిని హుటాహుటిన సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనపై రైల్వై శాఖ అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది.రైల్వే గాంగ్‌ మెన్‌ ఏమరి పాటుగా వుండడంతోనే ఈ దుర్ఘటన జరిగిందనిరైల్వే అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు గ్యాంగ్‌ మెన్‌ పరిస్థితి కూడా ఆందోలనకరంగావున్నదని అధికారులు వివరించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో దృశ్యాలు పరమభయానకంగా వున్నాయి. తెగిపడిన అవయవాలతో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో వున్న చెర్లపల్లి ప్రాంతానికి వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు. అధికారులు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని
కార్మికులు ఆరోపిస్తున్నారు. గాంగ్‌మెన్‌ పనిచేసే లైన్లపైకిరైళ్లు వచ్చేప్పుడు అటు డ్రైవర్లను ఇటు గ్యాంగ్‌మెన్‌ను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులకు వున్నదని వారుఅంటున్నారు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X