వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిరాయిస్తే ఖబడ్దార్‌ః ఎన్నికలసంఘం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కనీసం నాలుగు జిల్లాలలో తెలుగుదేశం-కాంగ్రెస్‌ పార్టీలకు బొటాబొటి మెజారిటీ రావడంతో అక్కడ రాజకీయ బేరసారాలు జరిగే అవకాశం వున్నదని ఎన్నికల కమిషన్‌ అనుమానిస్తున్నది. ఎన్నికల నిబంధనలకువిరుద్ధంగా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

ఈ నెల 22,23 తేదీలలో జరిగే మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులకు జరిగే ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ గార్గ్‌ వెల్లడించారు. ఫిరాయింపులను నిరోధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విప్‌ లు జారీ చేసి తమ అభ్యర్థులను ఎవరూ ప్రలోభ పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా గార్గ్‌ సూచించారు.

చిత్తూరు, విజయనగరం, రంగారెడ్డి జిల్లాలలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు దాదాపు సమానమైన స్థానాలు గెలుచుకున్నాయి. దీనితో తమ తమ పార్టీల అభ్యర్థులను కాపాడుకొనేందుకు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సమాచారంఅందింది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X