వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో లక్ష ఎకరాలకు తెలుగుగంగ
హైదరాబాద్: తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో నిర్మాణంలో వున్న భారీ ప్రాజెక్టుల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తొలుత పదివేల ఎకరాలతో ప్రారంభించి పాతిక వేల ఎకరాల వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల కెపాసిటీని పెంచాలని, శ్రీశైలం వరదనీటి సామర్ధ్యాన్ని హెచ్చించాలని నిర్ణయించారు. సాగునీరును అందించే కార్యక్రమంలో రైతులను కూడా భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..
- స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
Comments
Story first published: Thursday, July 19, 2001, 23:53 [IST]