వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌ ప్రజల శాసనోల్లంఘన

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంపాల్‌: కాల్పుల విరమణ విస్తరణకు వ్యతిరేకంగా మణిపూర్‌ ప్రజలు ప్రారంభించిన ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. యునైటెడ్‌ కమిటీ మణిపూర్‌ గురువారం నుంచి నాలుగురోజుల పాటు శాసనోల్లంఘన ఉద్యమం నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ ఉద్యమంలో భాగంగా వీధుల్లోకి వచ్చి బైఠాయింపులు జరుపుతున్నారు.

యుసిఎమ్‌ పిలుపుతో బ్యాంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు. మరో వైపు మణిపూర్‌ ప్రతినిధులు అరడజను మంది ఢిల్లీలో మకాం వేసి కాల్పుల విరమణ పొడగింపు వల్ల తలెత్తిన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నంలో వున్నారు. కాల్పుల విరమణ
విస్తరణకు మద్దతుగా వున్న నాగా కౌన్సిల్‌ పోటీ ఉద్యమానికి తయారు కావడంతో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించిపోయే ప్రమాదం వున్నదని మణిపూర్‌ ప్రభుత్వం భయపడుతున్నది.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X