వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతని కంటే ఘనుడు పరేఖ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: కొద్ది వారాల క్రితం వరకు స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణానికి సంబంధించి తన పాత్రను నిర్ధారించే రుజువులు అధికారులకు దొరికే అవకాశం లేదని బింకంగా వున్న బడా బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌ తాజా పరిణామాలతో బెంబేలెత్తిపోతున్నారు. కేతన్‌ పరేఖ్‌ వ్యవహారం చూస్తుంటే 1992 స్టాక్‌స్కామ్‌ మూలవిరాట్‌ బిగ్‌బుల్‌ హర్షద్‌ మెహతాకంటే ఘనుడిగా కనిపిస్తున్నారని అధికారులు అంటున్నారు.

కేతన్‌ పరేఖ్‌కు మాధవ్‌పూర్‌ మర్కెంటల్‌ బ్యాంకు జారీ చేసిన 130 కోట్ల రూపాయల విలువైన పేఆర్డర్లు బౌన్సైనట్టుగా ప్రకటించిన బాంక్‌ ఆఫ్‌ ఇండియాపై పరువునష్టం కేసు వేస్తానని రంకెలువేసిన కేతన్‌ ఇప్పుడు భయాందోళనలతో సతమతమైతున్నారు. గత కొద్ది రోజులుగా సెబి, సిబిఐ అధికారులు జరిపిన దర్యాప్తులో స్టాక్‌ మార్కెట్లను తన చెప్పుచేతుల్లో పెట్టుకొని ఆడించడానికి కేతన్‌ పరేఖ్‌ అసాధారణ స్థాయిలో 6400 కోట్ల రూపాయలను ఉపయోగించినట్టుగా వెల్లడయింది.

ఇంత అసాధారణ మొత్తం ఆయనకు అందుబాటులోకి వచ్చిన తీరు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. పైగా కేతన్‌ పరేఖ్‌ స్విస్‌ ఖాతాలో 340 కోట్ల రూపాయల మొత్తం వున్నట్టుగా కూడా సిబిఐ దర్యాప్తులో వెల్లడయింది. సాధారణంగా ఇటువంటి విషయాలను బయటపెట్టిన మరుక్షణంలోనే నిందితులను అరెస్టు చేసే సిబిఐ అధికారులు ఈసారి ఎందుకో మౌనంగా వున్నారు. సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం వున్నదన్న భయంతో ముంబాయి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసిన పరేఖ్‌ స్విస్‌ ఖాతాతో తనకేలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు.

  • స్థానిక సంస్థలఫలితాలు-జిల్లాల వారీగా
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X