వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం బిజెపి భాయీ భాయ్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీసీనియర్‌ నేత, కేంద్ర మంత్రి విద్యాసాగర్‌ రావు హితవు చెప్పారు. సంస్థాగత ఎన్నికల్లో బిజెపి చెప్పుకోతగ్గ స్థాయిలోసీట్లు సంపాదించలేక పోయిన విషయం విదితమే. తెలుగుదేశం తమను నిర్లక్షం చేసినందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బిజెపి నాయకులు గుర్రుగా వున్నారు.
బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చిలకం రామంచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీపైబాహాటంగా విలేకరుల సమావేశంలోనే విరుచుకుపడ్డారు. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్‌ రావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీకి సమయానుకూలంగా మద్దతు ఇవ్వాల్సిందిగాకోరారు. ఇరుపక్షాలు లాభపడే విధంగా స్థానిక బిజెపి నేతలు వ్యవహరించాలని ఆయన సూచించారు.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జయాపజయాలను ప్రభావితం చేసే విధంగా బిజెపి స్థానిక ఎన్నికల్లో స్థానాలు గెలుచుకోలేకపోయింది.అయినప్పటికీ కొన్ని మండల, జిల్లా పరిషత్‌ లను చేజిక్కించుకొనేందుకు బిజెపి మద్దతు తెలుగుదేశం పార్టీకి అవసరం అవుతుంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో సఖ్యతగానే మెలగాలని బిజెపి నిర్ణయించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X