దేశం బిజెపి భాయీ భాయ్!
హైదరాబాద్ః
స్థానిక
పరిస్థితులకు
అనుగుణంగా
తెలుగుదేశం
పార్టీకి
మద్దతు
ఇవ్వాల్సిందిగా
భారతీయ
జనతా
పార్టీ
రాష్ట్ర
నేతలకు
ఆ
పార్టీసీనియర్
నేత,
కేంద్ర
మంత్రి
విద్యాసాగర్
రావు
హితవు
చెప్పారు.
సంస్థాగత
ఎన్నికల్లో
బిజెపి
చెప్పుకోతగ్గ
స్థాయిలోసీట్లు
సంపాదించలేక
పోయిన
విషయం
విదితమే.
తెలుగుదేశం
తమను
నిర్లక్షం
చేసినందువల్లే
ఈ
పరిస్థితి
తలెత్తిందని
బిజెపి
నాయకులు
గుర్రుగా
వున్నారు.
బిజెపి
రాష్ట్ర
శాఖ
అధ్యక్షుడు
చిలకం
రామంచంద్రారెడ్డి
తెలుగుదేశం
పార్టీపైబాహాటంగా
విలేకరుల
సమావేశంలోనే
విరుచుకుపడ్డారు.
అయితే
కేంద్ర
హోం
శాఖ
సహాయ
మంత్రివిద్యాసాగర్
రావు
శుక్రవారం
విలేకరుల
సమావేశం
ఏర్పాటు
చేసి
తెలుగుదేశం
పార్టీకి
సమయానుకూలంగా
మద్దతు
ఇవ్వాల్సిందిగాకోరారు.
ఇరుపక్షాలు
లాభపడే
విధంగా
స్థానిక
బిజెపి
నేతలు
వ్యవహరించాలని
ఆయన
సూచించారు.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జయాపజయాలను ప్రభావితం చేసే విధంగా బిజెపి స్థానిక ఎన్నికల్లో స్థానాలు గెలుచుకోలేకపోయింది.అయినప్పటికీ కొన్ని మండల, జిల్లా పరిషత్ లను చేజిక్కించుకొనేందుకు బిజెపి మద్దతు తెలుగుదేశం పార్టీకి అవసరం అవుతుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో సఖ్యతగానే మెలగాలని బిజెపి నిర్ణయించుకుంది.