కివీస్చేతిలో భారత్ పరాజయం
కొలంబో: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరిస్లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది. 41 ఓవర్లలోనే భారత బ్యాట్స్మెన్ 125 పరుగులకే ఆల్ఔట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆడగాడు వివిఎస్ లక్ష్మణ్ ధాటిగా ఆడి 60 పరుగులు చేయడం ఒక్కటే శుక్రవారం నాడు మ్యాచ్లో విశేషంగా చెప్పవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఆటగాళ్లు ఇండియన్ స్పిన్ బౌలర్ల తాకిడికి ఎక్కువ సేపు బరిలో నిలదొక్కుకోలేకపోయారు. అతికష్టమ్మీద 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు టార్గెట్ను భారత తేలిగ్గానే అధిగమిస్తుందని అభిమానులు ఆశించారు.
అయితే
ఓపెనింగ్
బ్యాట్స్మెన్గా
వెళ్లిన
యువరాజ్
6
పరుగులకు
ఆ
వెంటనె
కెప్టెన్
సౌరభ్
గంగూలీ
అయిదు
పరుగులకు
ఔటు
కావడంతో
భారత్ను
దురదృష్టం
వెంటాడం
ప్రారంభమయింది.
50
పరుగులకే
5
వికెట్ల
నష్టంతో
వున్న
భారత్
పరువును
వివిఎస్
లక్ష్మణ్
మరోసారి
రాణించి
60
పరుగులతో
గట్టెక్కించారు.
స్కోర్ను
లక్ష్మణ్
100
మార్కును
దాటించినప్పటికీ
న్యూజిలాండ్
బౌలర్ల
తాకిడి
125
పరుగుల
లోపునే
భారత్
బ్యాటింగ్
ఆర్డర్
కుప్పకూలింది.