వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కివీస్‌చేతిలో భారత్‌ పరాజయం

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరిస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌ చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది. 41 ఓవర్లలోనే భారత బ్యాట్స్‌మెన్‌ 125 పరుగులకే ఆల్‌ఔట్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఆడగాడు వివిఎస్‌ లక్ష్మణ్‌ ధాటిగా ఆడి 60 పరుగులు చేయడం ఒక్కటే శుక్రవారం నాడు మ్యాచ్‌లో విశేషంగా చెప్పవచ్చు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ ఆటగాళ్లు ఇండియన్‌ స్పిన్‌ బౌలర్ల తాకిడికి ఎక్కువ సేపు బరిలో నిలదొక్కుకోలేకపోయారు. అతికష్టమ్మీద 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ జట్టు టార్గెట్‌ను భారత తేలిగ్గానే అధిగమిస్తుందని అభిమానులు ఆశించారు.

అయితే ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా వెళ్లిన యువరాజ్‌ 6 పరుగులకు ఆ వెంటనె కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అయిదు పరుగులకు ఔటు కావడంతో భారత్‌ను దురదృష్టం వెంటాడం ప్రారంభమయింది. 50 పరుగులకే 5 వికెట్ల నష్టంతో వున్న భారత్‌ పరువును వివిఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి రాణించి 60 పరుగులతో గట్టెక్కించారు. స్కోర్‌ను లక్ష్మణ్‌ 100 మార్కును దాటించినప్పటికీ న్యూజిలాండ్‌ బౌలర్ల తాకిడి 125 పరుగుల లోపునే భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X