జయపైపిటిషన్లుస్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీః
అన్నా
డిఎంకె
అధినేత్రి
జయలలితను
తమిళనాడు
ముఖ్యమంత్రిగా
ఎంపికచేయడాన్ని
సవాలు
చేస్తూ
దాఖలైన
పిటిషన్లను
సుప్రీంకోర్టు
శుక్రవారంవిచారణకు
స్వీకరించింది.
ఈ
పిటిషన్
ను
విచారణకుస్వీకరించడంతో
పాటు
సత్వర
పరిష్కారం
కోసం
ఐదుగురు
న్యాయమూర్తుల
ధర్మాసనానికి
నివేదించారు.
జయలలిత
తరవు
న్యాయవాదులు,
పిటిషనర్
తరపు
న్యాయవాదుల
వాదోపవాదాలువిన్న
అనంతరం
కేసును
ప్రత్యేక
బెంచికి
సిఫారసు
చేస్తూ
జస్టిస్
బరూచా,
జస్టిస్
సబర్
వాల్,
జస్టిస్
బ్రిజేష్
కుమార్
తో
కూడిన
త్రిసభ్య
బెంచ్
ఆదేశాలు
జారీ
చేసింది.
జైలుశిక్ష పడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేందుకుఅనర్హురాలంటూ జయలలిత ఎన్నికల పిటిషన్ను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చింది. అయితేజయ సారధ్యంలోని అన్నా డిఎంకె తమిళనాడుఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీనితోఅప్పటి గవర్నర్ ఫాతిమా బీవి జయలలితనుప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలైనవ్యక్తి కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంపైపెద్దఎత్తున దుమారం చెలరేగింది.
ఈ కేసు అత్యంతకీలకమైనదే కాకుండా గడువులోపుపరిష్కారం కావసివున్న దరిమిలా కేసును ఐదుగురుసభ్యులు ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తులునిర్ణయించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణంచేయడాన్ని ఐదుగురు న్యాయవాదులు సవాలుచేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించిజనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, సీనియర్న్యాయవాది సెల్వరాజ్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టుకు బదిలీచేశారు.
డిఎంకెకుఅపజయం
ఈ వ్యాజ్యాల్లో తమను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని కోర్టును కోరుతూ డిఎంకె దాఖలు చేసిన పటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చరాదని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూ డిఎంకె పిటీషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. జయ వ్యతిరేక పిటిషన్లలో తమను భాగస్వామిగా చేర్చుకోనంత మాత్రాన సుప్రీంకోర్టులో తమకు భంగపాటు జరిగినట్టుగా చెప్పడానికి లేదని డిఎంకె నేత కరుణానిధిపేర్కొన్నారు.