ప్రధానికి బిజెపి నేతల కితాబు
న్యూఢిల్లీ: ఆగ్రా శిఖరాగ్ర చర్చల విషయంలో ప్రధాని వాజ్పేయి వ్యవహార సరళిని బిజెపి నేతలు ఘనంగా ప్రస్తుతించారు. కాశ్మీర్ విషయంలో పాక్తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ వైఖరిని ప్రధాని వాజ్పేయి మొహమాటం లేకుండా పాకిస్తాన్కు చెప్పగలిగారని బిజెపి నేతలు పేర్కొన్నారు. బిజెపి కార్యదర్శి సునీల్శాస్త్రి సారథ్యంలో సీనియర్ నేతలు శుక్రవారం నాడు ప్రధాని వాజ్పేయిని కలిసారు.
ఈ సందర్భంగా వారు స్పష్టమైన ఎజెండా లేకుండా పాకిస్తాన్ పర్యటన పెట్టుకోవద్దని వారు ప్రధానిని కోరారు. ఇదిలా వుండగా ఆగ్రా శిఖరాగ్రం విఫలం కావడానికి ముషారఫ్ వైఖరే కారణమని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించారు. ఆగ్రా చర్చలపై తన ప్రకటనలపై చెలరేగిన వివాదం చర్చల ప్రతిష్ణంభనకు దారితీసిందన్న ఆరోపణలను ఆమె మరోసారి ఖండించారు.
ఆగ్రాలో
అగ్రనేతలు
చర్చలు
జరుపుతున్న
సమయంలోనే
శిఖరాగ్రంలో
కాశ్మీర్
ఊసు
లేదని
ప్రకటించి
సుష్మా
దుమారం
సృష్టించిన
విషయం
విదితమే.అయితే
ముషారఫ్
వైఖరి
ముఖ్యంగా
ఎడిటర్స్తో
బ్రేక్ఫాస్ట్
సమావేశంలో
ఆయన
చేసిన
వ్యాఖ్యలు
టీవీల్లో
ప్రసారం
కావడంతో
శిఖరాగ్రం
కుప్పకూలక
తప్పని
స్థితి
ఏర్పడిందని
ఆమె
వ్యాఖ్యానించారు.