వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
500 కోట్లతో చండీగఢ్లో ఐటి పార్క్
న్యూఢిల్లీ:చండీగఢ్ లో 500 కోట్ల ఖర్చతో 100 ఎకరాల స్థలంలో భారీ ఎత్తున ఐటి పార్క్ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల చండీగఢ్కు ఏటా కనీసం అదనంగా 150 కోట్ల రూపాయల రాబడి లభించగలదని అంచనా.
అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు భాగస్వాములను ఖరారు చేసేందుకు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం ప్రయత్నాల్లో వుంది. ప్రపంచమంతా ఐటి మాంద్యంతో ఆటుపోట్లకు గురవుతుంటే ఆలస్యంగా మేలుకున్న చండీగఢ్ అట్టహాసంగా చేపడుతున్న ప్రాజెక్టు ఏ మేరకు విజయవంతమవుతుందో అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Story first published: Monday, July 23, 2001, 23:53 [IST]