వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆత్మవిమర్శకు చంద్రబాబు లేఖలు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పనితీరుపై అట్టడుగుడు స్థాయనుంచి ప్రతిచిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని టిడిపి నేతలకు, కార్యకర్తల్లోని ముఖ్యులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా లేఖలు రాశారు.
ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలతో పాటు స్థానిక అంశాలు కూడా ఫలితాలను ప్రభావితం చేశాయని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ విధానాలకు సంబంధించిన అంశాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపోటములకు ఏమేరకు దోహదం చేశాయో విమర్శ చేయడం ద్వారా పార్టీని, ప్రభుత్వ విధానాలను సమగ్రంగా పునర్వ్యవస్థీకరించవచ్చని తెలుగుదేశం పార్టీ అగ్రనేత అభిప్రాయపడుతున్నారు.
Comments
Story first published: Wednesday, July 25, 2001, 23:53 [IST]