న్యూజిలాండ్పై శ్రీలంక విజయం
కొలంబో: ముక్కోణపు వన్డే క్రికెట్ సిరీస్లో శ్రీలంక తన విజయపరంపరను కొనసాగిస్తోంది. బుధవారం ఇక్కడ న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో శ్రీలంక విజయకేతనం ఎగురవేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 236 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు ముందుంచింది. అర్నాల్డ్, ఆటపట్టుల నిలకడైన బ్యాటింగ్తో, సురేష్ పరేరా బ్యాటింగ్లో ప్రదర్శించిన ప్రతిభతో శ్రీలంక విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో శ్రీలంక న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. ఒకానొక సందర్భంలో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. సనత్ జయసూర్య, గుణవర్ధనే ఐదేసి పరుగులకు అవుట్ కాగా, జయవర్ధనే, కలువితరణలు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ దారి పట్టారు. దీంతో శ్రీలంకకు ఓటమి తప్పదనే అనిపించింది.
ఆ
తర్వాత
ఆటపట్టు,
రస్సెల్
అర్నాల్డ్
తమ
భాగస్వామ్యంలో
110
పరుగులు
చేసి
శ్రీలంక
విజయానికి
మార్గం
వేశారు.
ఆటపట్టు
66
పరుగుల
వ్యక్తిగత
స్కోర్
వద్ద
రన్
అవుట్
అయ్యాడు.
ఈ
సమయంలో
సురేష్
పరేరా
అర్నాల్డ్కు
తోడయ్యాడు.
వీరిద్దరు
88
బంతుల్లో
103
పరుగులు
చేసి
శ్రీలంకకు
విజయాన్ని
అందించారు.
91
పరుగులతో
నాటౌట్గా
మిగిలిన
అర్నాల్డ్
మ్యాన్
ఆఫ్
ది
మ్యాచ్గా
ఎంపికయ్యాడు.
ఈ
విజయంతో
శ్రీలంక
వరుసగా
మూడు
మ్యాచ్ల్లో
గెలిచి
ఆరు
పాయింట్లు
సాధించింది.
సురేష్
పరేరా
56
పరుగులు
చేసి
నాటౌట్గా
మిగిలాడు.
న్యూజిలాండ్
భారత్పై
గెలిచి
రెండు
పాయింట్లు
సాధించింది.
శ్రీలంకతో
ఆడిన
రెండు
మ్యాచ్ల్లోనూ
న్యూజిలాండ్
ఓడిపోయింది.
భారత్
రెండు
మ్యాచ్ల్లోనూ
ఓటమినే
చవి
చూసింది.