వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాదరణపైదేశం విశ్లేషణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సంస్థాగత ఎన్నికల ఫలితాలపై అధికార తెలుగుదేశం పార్టీవిశ్లేషణ ప్రారంభించింది. ఎన్నికల తతంగం ముగిసిన అనంతరం మొట్టమొదటి సారిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు వివిధ కమిటీల కన్వీనర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు.

పార్టీ విధానాలపై సమీక్ష జరగాల్సిన అవసరం వున్నదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సంస్థాగత ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరీ అంత తీసికట్టుగా లేకపోయినప్పటికీ పార్టీ పట్ల కొంత వ్యతిరేక ధోరణి కనిపించిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం నేతలు మరింత శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకతను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొనేందుకు ఇకమీదట క్రమం తప్పకుండా నెలకు ఒకసారి పొలిట్‌ బ్యూరో, తెలుగుదేశం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X