వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పులు దిద్దుకుంటాం:చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజల మనోభావాలను కచ్చితంగా తెలుసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి లభించిందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ముందుముందు పార్టీ తన పద్దతులను ప్రజల అభిష్టానికి అనుగుణంగా మలుచుకునే వెసులుబాటు లభించిందని ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది.

బుధవారం నాడు ఎన్‌టిఆర్‌ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల నేతల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిపై చర్చ జరిగింది. ఈ ఫలితాల గురించి బాధపడకుండా గుణపాఠంగా తీసుకుని మునుముందు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆదరణ లభించేలా కృషి చేయాలని చంద్రబాబు చెప్పారు. పార్టీ ఎంపి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సారథ్యంలో ఏర్పాటు చేసిన నలుగురు ఎమ్మెల్యేల సంఘం ఫలితాలపైఅంచనాలను రూపొందిస్తుందని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X