రాష్ట్ర నేతల మాటలూ బేఖాతరు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల అభ్యర్థలఎంపికలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగలేదు.ప్రదేశ్ కాంగ్రెస్ కుటీ (పిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకున్నప్పటికీ ప్రతిష్టంభనతొలగిపోలేదు. కాంగ్రెస్లో నెలకొన్న భేదాలవల్ల చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడ్డాయి.
దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పిసిసి తరఫునశివరామకృష్ణయ్యను చిత్తూరుకు పంపారు. ఆయనరాయబారం ఫలించకపోవడంతో సత్యనారాయణరావు, రాజశేఖర్ రెడ్డి జోక్యంచేసుకున్నారు. జడ్పిటిసిల మెజారిటీఅభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని జిల్లా పరిషత్ఉపాధ్యక్ష పదకి అభ్యర్థిని ఎంపిక చేయాలని చిత్తూరు జిల్లాజడ్పటిసిలు పట్టుబట్టారు. దీనికి పిసిసి అధ్యక్షుడుదానికి అంగీకరించలేదు. మెజారిటీ అభిప్రాయం ప్రకారంఉపాధ్యక్ష పదకి అభ్యర్థిని ఎంపిక చేయాలని అనడంసరికాదని ఆయన అన్నారు. దీనికి జడ్పిటిసి సభ్యులు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభనతొలిగిపోలేదు.