వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తు
కొలంబో: న్యూజిలాండ్తో గురువారం జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్ 67 పరుగుల తేడాతో భారత జట్టుపై జయం సాధించింది. భారత బ్యాట్స్మన్ న్యూజిలాండ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఘోరంగా ఫలమయ్యారు. జయం కోసం భారత్ 201 పరుగులు చేయాల్సి వుండగా 39.4 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్ గంగూలీ నాలుగు పరుగులకే అవుట్ కాగా, లక్ష్మణ్ ఒకే ఒక పరుగుకు తన కెట్ కోల్పోయాడు.
షెహవాగ్ 33 పరుగులు, ద్రాడ్ 27 పరుగులు, యువరాజ్ సింగ్ 28 పరుగులు చేశారు. ుగతా బ్యాట్స్మెన్ ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్మెన్ పూర్తిగా ఫలమయ్యారు. ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్కు వరుసగా ఇది మూడవ అపజయం. న్యూజిలాండ్పై ఇది రెండవ ఓటు. శ్రీలంక చేతిలోనూ భారత్ ఓడిపోయింది.
Comments
Story first published: Thursday, July 26, 2001, 23:53 [IST]