కరువు ప్రాంతాలకు రూ.140 కోట్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని కరువు పీడితప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంరూ. 140 కోట్లు డుదల చేసింది. కరువు నెలకొన్న 911మండలాల్లో మంచినీరు, పశుగ్రాసం సరఫరాకు, ఉపాధి కల్పనకు ఈనిధులను ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయిసమావేశంలో నెలకొన్న కరువు పరిస్థితులనుసdుక్షించారు. నైరుతి రుతు పవనాలు ఆశించిన రీతిలో ఫలితం చూపకపోవడంతోరాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ప్రాంతాల్లోని ప్రజలకు ఒక్కో కుటుంబానికిరూ. 6.40 పైసలకు కిలో చొప్పున నెలకు 20 కిలోలబియ్యం అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
నీటియాజమాన్య పద్ధతుల్లో పంటలు వేయాలనివ్యవసాయ శాఖ రైతులకు సూచనలుచేసిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాలనుఆదుకోవాలని కోరుతూ త్వరలో కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపైచర్చించేందుకు ఈ నెల 29వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనిచంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు ఇబ్బంది కలగకుండా ఆల్మట్టినుంచి నీరు డుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రినితాను కోరినట్లు ఆయన తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రితోతాను ఫోన్లో మాట్లాడానని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారనిఆయన చెప్పారు.