వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్జీలు పెంచిన సిఫీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కారుచౌకగా ఇంటర్నెట్‌ ఆక్సెస్‌ లభించే రోజులు పోయాయి. దేశంలోని ప్రైవేట్‌ ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లలో అగ్రస్థానంలో వున్న సత్యం ఇన్ఫోవే డయల్‌అప్‌ ఆక్సెస్‌ ప్రోడక్ట్స్‌ చార్జీలను గణనీయంగా పెంచింది. ఐఎస్‌పిలపై ప్రభుత్వం ఈ మధ్య విధించిన అయిదు శాతం పన్ను సిఫి ఈ నిర్ణయం తీసుకుంది. విఎస్‌ఎన్‌ఎల్‌ కూడా అదే బాటలో చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నది.

ప్రభుత్వం విధించిన అయిదు శాతం వడ్డన తాము వినియోగదారులపై వేస్తున్నామని కొత్త చార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని సిఫీ అధికారులు చెప్పారు. 25 గంటల ఇంట్రడక్టరీ ఆఫర్‌ ప్యాకేజీ ధరను సిఫీ ప్రస్తుత 199 రూపాయల నుంచి 249 రూపాయలకు పెంచింది. కాగా 100 గంటల ప్యాకేజీ ధరను 10 శాతం హెచ్చింపుతో 890 రూపాయలుగా మార్చారు. అదే విధంగా నెల రోజుల అన్‌లిమిటెడ్‌ పాకేజీ ధరను 349 నుంచి 6 శాతం హెచ్చింపుతో 369 రూపాయలకు హెచ్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X