పూలన్కు పార్లమెంట్ ఘన నివాళి
న్యూఢిల్లీ:
పార్లమెంట్కు
కూతవేటు
దూరంలో
బుధవారం
నాడు
దారుణ
హత్యకుగురైన
సమాజ్వాది
ఎంపి
ఫూలన్
స్మృతికి
పార్లమెంట్
గురువారం
నాడు
ఘనంగా
నివాళులర్పించింది.
అట్టడుగు
స్థాయినుంచి
అనేక,సంక్షోభలనుంచి
ఎదిగివచ్చిన
ఫూలన్
జీవనం
దేశంలోని
సామాజిక,
రాజకీయ,
ఆర్ధిక
పరిస్థితులకు
నిలువుటద్దమని
లోకసభస్పీకర్
బాలయోగి
కొనియాడారు.
ఫూలన్కు
నివాళిఅర్పించిన
తర్వాత
సభను
శుక్రవారానికి
వాయిదా
వేశారు.
ఇదిలా వుండగా ఫూలన్ భౌతిక కాయానికి గురువారం నాడు ఉత్తరప్రదేశ్లోని మర్జాపూర్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పలు ప్రధాన పార్టీల నేతలు, వేలాది మంది అభిమానులు, ప్రజలు ఫూలన్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయ కారాణాలతో అధికార ఎన్డిఎ మద్దుతుతో ఫూలన్ హత్య జరిగిందని ఆరోపిస్తూ సమాజ్వాది పార్టీ గురువారం నాడు ఉత్తరప్రదేశ్ బంద్కు పిలుపునిచ్చింది.
సామాజిక
న్యాయం
కోసం
పోరాడుతున్న
అణగారిన
వర్గాల
ప్రతినిధి
ఫూలన్
దారుణహత్య
అమానుషమని,
ఇది
ప్రభుత్వఘోరవైఫల్యానికి
నిదర్శనమని
సిపిఎం
ఖండించింది.
పార్లమెంట్కు
అత్యంత
దగ్గరగా,
ముఖ్యులు
నివసించే
ప్రాంతంలో
జరిగిన
ఈ
హత్య
భద్రతా
యంత్రాంగం
వైఫల్యానికి
నిదర్శనమని
సిపిఎం
నేత
సోమనాథ్
చటర్జీ
అన్నారు.