వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెతానీ హోం సాత్రమ్మ లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పసి పిల్లల దత్తతకేసులో ప్రధాన నిందితురాలైన పోతిరాజు సాత్రమ్మ గురువారంలొంగిపోయారు. ఆమె నాటకీయంగా సిబిఐ ప్రత్యేక కోర్టుముందు లొంగిపోయారు. రంగారెడ్డి జిల్లాలోని బెతానీహోం నిర్వాహకురాలైన సాత్రమ్మ మూడునెలలుగా పరారీలో వున్నారు. పసి పిల్లల దత్తతవ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు సాత్రమ్మపై రంగారెడ్డిజిల్లాలో రెండు కేసులు, హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. బెతానీహోంపై దాడి జరిపి 125 మంది పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం రక్షించినప్పటినుంచి ఆమె జాడ లేదు. ఆమె ఆచూకీ తెలిపినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రివార్డు కూడాప్రకటించింది.

ఆమెఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనూ, బెంగుళూర్‌హైకోర్టులోనూ ముందస్తు బెయిల్‌ కోసందరఖాస్తు చేసుకున్నారు. ఆమె రిట్‌ పిటిషన్లను ఈ కోర్టులుత్రోసిపుచ్చాయి. ఆమె అమెరికాలోని తన సన్నిహితబంధువు ఇంట్లో తలదాచుకున్నారని,బెంగుళూర్‌లోనే వున్నారని వదంతులు తీవ్రంగాబయలుదేరాయి. చివరికి ఆమె గురువారం బురఖావేసుకుని, తన తరఫు న్యాయవాదితో కోర్టుముందు లొంగిపోయారు. ఆమెను ఆగస్టు ఒకటవ తేదీవరకు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపుతూ తొు్మదవమెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెనుహైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలుకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X