వాజ్పేయి పాక్ యాత్ర అనుమానమే
న్యూఢిల్లీ: భారత ప్రధాని వాజ్పేయి ఈ ఏడాదిలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఆగ్రా శిఖరాగ్ర చర్చల సందర్భంగా వాజ్పేయిని పాక్ పర్యటనకు రావల్సిందిగా పాకిస్తాన్ అధినేత ముషారఫ్ ఆహ్వానించిన విషయం విదితమే. అప్పుడు లాంఛనంగా ఆహ్వానించిన ముషారఫ్ శుక్రవారం నాడు అధికారికంగా కూడా ఆహ్వానాన్ని పంపారు.
ఇస్లామాబాద్తో చర్చల కొససాగింపుపై ప్రధాని కృతనిశ్చయంతో వున్నారని అయితే డిసెంబర్ వరకు అధికార కార్యక్రమాలు తీరిక లేకుండా ముందుగానే ఖరారైన కారణంగా ఈ ఏడాది పాక్ పర్యటన వీలుకాకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే ఈ డిసెంబర్లోగా వాజ్పేయి, ముషారఫ్ కలుసుకుని మాట్లాకునే అవకాశాలు మాత్రం వున్నాయి. సెప్టెంబర్లో జెనివాలో జరుగుతున్న ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలూ పాల్గొంటున్నారు.
ఈ
సందర్భంగా
వీరిమధ్య
ప్రైవేట్
సమావేశానికి
అవకాశం
వుంది.
అదేవిధంగా
డిసెంబర్లో
ఖాట్మాండులో
జరుగనున్న
సార్క్
సదస్సు
సందర్భంగా
కూడా
ఉభయులు
ద్వైపాక్షిక
అంశాలపై
చర్చ
జరిపే
అవకాశం
వుంది.
వాజ్పేయి
ఈ
అక్టోబర్లో
రష్యా
పర్యటనకు
వెళ్లుతున్నారని,
నవంబర్లో
ఆస్ట్రేలియా
పోతున్నారని
అధికార
వర్గాలు
చెప్పాయి.
ఈ
బిజీ
కారణంగా
ఆయన
పాకిస్తాన్
పర్యటన
ఈ
ఏడాది
సాధ్యపడకపోవచ్చని
వారు
తెలిపారు.