వార్ మెరుపు దాడి-ఐదుగురు బలి
వరంగల్:వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పోలీసు స్టేషన్పైనిషిద్ధ పీపుల్స్వార్ నక్సలైట్లు ఆదివారం ఉదయం రెండు ట్రాక్టర్క్లైమోర్ మైన్స్తో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురుమరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మరణించినవారిలోఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు, ఒక కానిస్టేబుల్ వున్నారు.మరణించిన సిఆర్పిఎఫ్ హెడ్కానిస్టేబుళ్లలో ఒకరు మధ్యప్రదేశ్కుచెందిన ఆర్.ఎస్. చౌహాన్ కాగా మరొకరు పశ్చిమ బెంగాల్కుచెందిన డి.బి. బసక్. సిల్ కానిస్టేబుల్ మోహన్వరంగల్ జిల్లా గూడూరు మండలం బొద్దిగొండ గ్రామానికిచెందినవాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినవన్యప్రాణి సంరక్షణ భాగానికి చెందిన ఫారెస్టు గార్డ్రాజమౌళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఏటూరునాగారానికిచెందిన ఆలయ పూజారి శ్యామ్ప్రసాద్ శర్మ అర్థరాత్రిదాటిన తర్వాత మరణించాడు.
నక్సలైట్లదాడిలో ఏటూరు నాగారం శివార్లలో వున్న పోలీసు స్టేషన్,సిఆర్పిఎఫ్ బ్యారెక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సర్కిల్ఇన్స్పెక్టర్ క్వార్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి భవనం, రెండు ఫారెస్టుక్వార్టర్లు, ఫారెస్టు చెక్పోస్టు, స్టేషన్ కాంపౌండ్వాల్ పాక్షికంగా దెబ్బ తిన్నాయి. మునపెన్నడూ లేనిధంగా నక్సల్స్ స్టేషన్ సdుపంలో డైరెక్షనల్మైన్స్తో నింపిన ట్రాక్టర్లు వుంచి రిమోట్కంట్రోల్తో పేల్చివేశారు. నాలుగు లారీల్లో దాదాపు రెండువందల మంది నక్సలైట్లు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులుగుర్తించారు. ఆదివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలోఇద్దరు యువకులు పోలీసు స్టేషన్ వద్ద ట్రాక్టర్నునిలిపి పక్కనే వున్న గుడిలోకి వెళ్లి దండంపెట్టుకుని బయటకు వచ్చి రిమోట్ కంట్రోల్తోట్రాక్టర్లో ఉన్న మందు గుండను పేల్చారు. సుమారు గంటకుపైగా పోలీసులు కాల్పులు జరిపారు.
పోలీసు స్టేషన్ పేల్చివేత సంఘటన పది కిలోdుటర్ల దూరం వరకు తన ప్రభావాన్ని చూపింది. నక్సల్స్ పకడ్బందీగా ఒక పథకం ప్రకారం దాడి చేశారని పోలీసులు భాస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే గ్రే హౌండ్స్ ఐజి ఉమేష్కుమార్ అక్కడికి చేరుకున్నారు. నక్సలైట్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.