వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక చేతిలో న్యూజిలాండ్‌ చిత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ల ధాటికి న్యూజిలాండ్‌ కుప్పకూలింది. న్యూజిలాండ్‌పై శ్రీలంక 107 పరుగుల ఆధిక్యతతోవిజయం సాధించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్‌ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు.టాస్‌ గెల్చిన న్యూజిలాండ్‌ శ్రీలంకను బ్యాటింగ్‌కు దించింది. శ్రీలంక నిర్ణీత 36 ఓవర్లలో ఆరువికెట్లు మాత్రమే కోల్పోయి 221 పరుగులు సాధించింది. జయవర్ధనే 46 బంతుల్లో 58 పరుగులు చేశాడు. గుణవర్ధనే 38 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాక్‌మిల్లర్‌ మాత్రమే
శ్రీలంక బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టగలిగాడు. మాక్‌మిల్లర్‌ 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఓవరుకు ఆరు పరుగులకుపైగా చేయాల్సి వుండగా 18 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చాముండ వాస్‌ బౌలింగ్‌ ధాటికి న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ నిలదొక్కుకోలేకపోయారు.ఇరవై పరుగుల మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న చాముండ వాస్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌ 57 పరుగల వద్ద మరో మూడువికెట్లు కోల్పోయింది. 57 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ పరువును నిలబెట్టడానికి టెయిలర్‌ ఎండర్స్‌ కృషి చేశారు. నాష్‌ 23 పరుగులు చేయగా, హరీస్‌ 18,మిల్స్‌ 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత 36 ఓవర్లలో 115 పరుగులు చేసింది. శ్రీలంకపై న్యూజిలాండ్‌కు వరుసగా ఇది మూడోఅపజయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X