కోడ్ రెడ్ పై ఇండియన్ టెకీల పోరు
వాషింగ్టన్:ఇంటర్నెట్ వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టంచేస్తూ ప్రత్యక్షమైన ప్రతిసిస్టమ్ను పనికిరాకుండామారుస్తున్న ప్రమాదకరమైన వైరస్ కోడ్రెడ్ సృష్టిస్తున్న బీభత్సాన్ని ఎదుర్కోవడానికిసిలికాన్వ్యాలీలోని ఇండియన్ టెకీలు సమాయత్తమవుతున్నారు.
కోడ్ రెడ్ వైరస్ ఇప్పటికేమూడు లక్షల కంప్యూటర్ సర్వర్లను మట్టికరిపించింది.అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లు అనేకం ధ్వంసమయ్యాయి.కోడ్ రెడ్గా అమెరికా నిపుణులు నామకరణం చేసినఈ వైరస్ గురించి మైక్రోసాఫ్ట్, అమెరికా ప్రభుత్వంప్రత్యేకంగా హెచ్చరికలు జారీచేశాయి. తొలుతజులై 19న ప్రత్యక్షమైన ఈ వైరస్ ఈ మంగళవారంనాడు మరింత బీభత్సం సృష్టించే అవకాశంవున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ వైరస్ సోకిన కంప్యూటర్లస్క్రీన్పై హాక్డ్పై చైనీస్ అనే అక్షరాలు ప్రత్యక్షమవుతుండటంతోదీనిని చైనీయులు పనిగా భావిస్తున్నారు. హలోహౌఆర్యూ, ఈ ఫైల్ చదివి మీ అభిప్రాయం చెప్పండీఅంటూ ఆత్మీయమైన పలకరింపుతో వచ్చినమెసెజ్ల వెనక దాగిన సిర్కోమ్ వైరస్ కంటేఈ కోడ్ రెడ్ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదనినిపుణుపలు చెబుతున్నారు. సిర్కోమ్ వెరస్ ఇన్ఫెక్ట్కావాలంటే మెసెజ్ను డౌన్లోడ్ చేసుకోవల్సివుంటుంది.రెడ్కోడ్కు ఆ అవసరం కూడా లేదు.
సిలికాన్ వ్యాలీకి చెందినప్రవాస ఐటి నిపుణులు శ్రీవత్స సంపత్ సారథ్యంలోనిమాక్ఎఫీ ఆన్లైన్ సెక్యురిటీ కోసం టెక్నాలజీనిడెవలప్చేసే ప్రయత్నాల్లో వుంది. గతంలోఇంటెల్, నెట్స్కేప్లో పనిచేసిన సంపత్ తమిళనాడుకుచెందిన వారు. ఉన్నీ వారియర్, శ్రీకాంత్ చారి స్థాపించినసైబర్మీడియా కూడా వైరస్ సవాలు నుంచికంప్యూటర్ నెట్వర్క్లకు రక్షణ కల్పించే ప్రాడక్ట్స్నుపెద్దఎత్తను డెవలప్ చేస్తున్నది.