ఐటి సర్వీసుల్లోకి ఎస్బిఐ
హైదరాబాద్: రానున్న మూడేళ్ల కాలంలో భారీ ఎత్తున టెక్నాలజీ అప్గ్రేడేషన్కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు అవసరమైన ఐటి సర్వీసులు, కార్యకలాపాల నిమిత్తం ఒక ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎస్బిఐ టెక్నాలజీ విభాగంగా ఉండబోయే ఈ సబ్సిడరీపై 700 కోట్ల రూపాయలను వెచ్చింనున్నట్టుగా ఎస్బిఐ మానేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ చెప్పారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎంల ఏర్పాటు వంటివి ఈ అనుబంధ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఐటి, ఇంటర్నెట్ ఆధారిత సేవలతో పాటు ట్రెజరీ అండ్ అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ వంటి ముఖ్యమైన బ్యాంకింగ్ కార్యకలాపాలకు అవసరమైన సాఫ్ట్వేర్ను కూడా కొత్త సంస్థ డెవలప్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎస్బిఐకి ప్రస్తుతం 600 ఎటిఎం కేంద్రాలున్నాయి. వచ్చే రెండేళ్లలో వీటి సంఖ్యను 1000కి హెచ్చించనున్నట్టుగా ఎస్బిఐ ఎండి చెప్పారు.