వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్లపై ఎంఎస్‌ ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరంగల్‌, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను తెలుగుదేశం పార్టీ గెలుచుకునేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలపై చర్యకు ఆ పార్టీ అధిష్టానవర్గం సిద్ధంగా వుంది. స్థానిక సంస్థల ఎన్నికల తీరుతెన్నులపై, రాష్ట్ర నేతల వైఖరిపై పిసిసి నేత ఎంఎస్‌ అధిష్టానవర్గానికి సోమవారం నాడిక్కడ తన అభిప్రాయాలను తెలియజేశారు.

పార్టీ అగ్రనేత సోనియాగాంధీని, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా వున్నఅంబికాసోనీని ఆయన కలుసుకున్నారు. పార్టీకే విద్రోహం తలపెడుతున్న నేతలపై కఠిన చర్య తీసుకోని పక్షంలో పార్టీని నడపడం తనవల్ల కాదని ఈ సందర్భంగా ఎంఎస్‌ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే వారు ఎంతపెద్ద నాయకులైనా వారిపై చర్య తీసుకోవడం అవసరమని ఆయన నాయకత్వానికి సూచించినట్టుగా తెలిసింది.

ఎంఎస్‌ ఫిర్యాదులు, అభిప్రాయాలువిన్న కాంగ్రెస్‌ అగ్రనేత, సీనియర్‌ నాయకున్ని పరిశీలకునిగా పంపి నిజానిజాలు నిర్దారించాల్సిందిగా ఆదేశించాలని నిర్ణయించారు. మన్మోహన్‌సింగ్‌,అర్జున్‌సింగ్‌, ప్రణబ్‌ముఖర్జీ, మాధవరావు సింధియా, ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ వంటి నేతలతో కూడా సత్యనారాయణరావు సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X