నక్సలిజం విరుగుడుకు భూసంస్కరణలు
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సలైట్ సమస్య పరిష్కారానికి భూసంస్కరణలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నక్సలైట్ సమస్యపై హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలోని ఖాళీ భూములనుపెద్ద యెత్తున పేదలకు పంచనున్నట్లు మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో భూపంపకంపై, ఉపాధి అవకాశాల పెంపుపై ఆయా శాఖలు అధ్యయన పత్రాలు సమర్పిస్తాయని, ఈ అధ్యయన పత్రాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తామని, ఆ తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు.
భూములను కొనుగోలు చేసి పంచే ల్యాండ్ పర్చేజ్స్కీమ్కు నిధులు పెంచాల్సిన అవసరం వున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 40 వేల ఎకరాలు పంచామని సాంఘిక సంక్షేమ శాఖ చెప్తుతోందని, అయితే, ఈ భూమిలో కొంత భాగంసేద్యంలోకి రాలేదని కూడా చెప్తుతోందని, ఈ భూములుసేద్యంలోకి రాకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు.
గ్రామీణ పేదల కోసం ప్రతిపాదించి విరమించుకున్న న్యాయ పంచాయతీల ప్రతిపాదనను ఆచరణలోకి తేవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. నక్సలైట్లతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని, అయితే చర్చలకు నక్సలైట్లుపెట్టిన షరతులు ఆమోదయోగ్యం కావని ఆయన అన్నారు.