వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేర్లు లేకుండా పంచాయతీ బ్యాలెట్లు
హైదరాబాద్: అభ్యర్థులపేర్లు లేకుండానే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలను ముద్రించింది. రాష్ట్రంలో 21 వేలకుపైగా గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపాల్సి వుంది. ఇందుకు గాను ముందుగానే ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పత్రాలు ముందుగానే ముద్రించింది.
దీంతో అభ్యర్థులపేర్లు బ్యాలెట్ పత్రాలపై కనిపించవు. లక్షలాది బ్యాలెట్ పత్రాలను అభ్యర్థులు ఖరారైన తర్వాత ముద్రించడం కష్టం కాబట్టి ముందుగానే వాటిని ముద్రణను చేపట్టింది. దీంతో ఓటర్లు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను బట్టి ఓటు చేయాల్సి వుంటుంది.పైగా అక్షర క్రమాన్ని బట్టి ఈ చిహ్నాలను ముద్రించారు. ఈ స్థితిలో పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నెంబర్ను, గుర్తును జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటే తప్ప ఫలితం వుండదు.
Comments
Story first published: Tuesday, July 31, 2001, 23:53 [IST]