వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎం రాజీనామా ప్రతిపాదనపై గందరగోళం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ చేసిన ప్రకటనపై పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం చెలరేగింది. ప్రధాని రాజీనామా ప్రతిపాదనపైవివరణ ఇవ్వాలని పట్టుబడుతూ ప్రతిపక్షాలు రాజ్యసభ కార్యకలాపాలను స్తంభింపజేశాయి.

మధ్యాహ్నం సభ తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ ప్రమోద్‌ మహాజన్‌ ప్రకటనపైవివరణకు డిమాండ్‌ చేశారు. దీంతో సురేష్‌ పచౌరీ, నీలోత్పల్‌ బసు, సార్ల మహేశ్వరి(సిపిఎం), శంకర్‌ రాయ్‌ మహాజన్‌ ప్రకటన ప్రతులను చూపుతూ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు ఒకానొక సందర్భంలో చైర్మన్‌ కృష్ణకాంత్‌ పోడియం వైపు దూసుకెళ్లారు. దీంతో కృష్ణకాంత్‌ సభను బుధవారం నాటికి వాయిదా వేశారు. ఇదేవిషయమై ఉదయం సభ రెండు సార్లు వాయిఆదా పడింది.

ఇదిలా వుంటే, వాజ్‌పేయి రాజీనామా ప్రతిపాదనను బిజెపి పార్లమెంటరీ పార్టీ తిరస్కరించింది. ఈవిషయమై చర్చించడానికి బుధవారం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) సమన్వయ సంఘం సమావేశం జరుగుతోంది. ప్రధాని రాజీనామా ప్రతిపాదనను పార్లమెంటరీ పార్టీ ముక్తకంఠంతో వ్యతిరేకించిందనివి.కె. మల్హోత్రా విలేకరులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X