వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకపై భారత్‌జయభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబోః శ్రీలంకపై భారత్‌ రెండో గెలుపు నమోదు చేసుకుంది. భారత్‌ 8వికెట్లకు 227 పరుగలు చేయగా, శ్రీలంక 47 ఓవర్లకే ఆలవుట్‌అయింది. గురువారం న్యూజిలాండ్‌ -భారత్‌ మధ్య జరిగే పోరులోవిజేతలు ఈనెల 5న శ్రీలంకతో జరిగే ఫైనల్‌ లో ఆడతారు.టాస్‌ ఓడిన గంగూలీ బృందం మొదటి నుంచిపీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వాస్‌ మొదటి బంతికేసెహవాగ్‌ ను అవుట్‌ చేశాడు. అతరువాత గంగూలీ పరుగులేమీ చేయకుండానేపెవిలియన్‌ దారి పట్టాడు. పది పరుగులకు లక్ష్మణ్‌ కూడా అవుటవ్వడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఆ తరువాత ద్రావిడ్‌, యువరాజ్‌ సింగ్‌ చక్కగా ఆడి భారత్‌ పరువు నిలిపారు. ద్రావిడ్‌ 47 పరుగులు చేయగా, యువరాజ్‌ సింగ్‌ అద్భుతంగా ఆడి 110 బంతుల్లో 98 పరుగులు చేశాడు.

228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్‌ మెన్‌ ను భారత్‌ బౌలర్లు మొదటి నుంచి ఇబ్బందుల పాలు చేశారు. కలువితరణ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌కాగా, జయసూర్య 10 పరుగులకు ద్రావిడ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో అవుటయ్యాడు. ఆటపట్టు ఒక పరుగుకు అవుటయ్యాడు.మిగిలిన బ్యాట్స్‌ మెన్‌ ఎవరూ చెప్పుకోతగ్గ స్కోర్లు చేయలేకపోడంతో భారత్‌విజయం సునాయాసమైంది. నెహ్రాకు మూడువికెట్లు, గంగూలీకి రెండు, జహీర్‌ కు రెండు, హర్భజన్‌ కు ఒకవికెట్‌ లభించగా ఇద్దరు ఆటగాళ్ళు రనౌట్‌ అయ్యారు.

అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన యువరాజ్‌ సింగ్‌ కు మ్యాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X