అటల్జీకే దేశం అండదండలు
న్యూఢిల్లీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఉత్తమ నాయకత్వ లక్షణాలు వున్నాయని అటువంటి నేత మరొకరు లేరని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. వాజ్పేయిని రాజీనామా నిర్ణయం ఉపసంహరించుకోవల్సిందిగా తెలుగుదేశం పార్టీ గట్టిగా విజ్ఞప్తి చేసిందని ఆయన చెప్పారు.
అక్రమాలు ఏమైనా వుంటే వాటిపై కఠిన చర్య తీసుకోవల్సిందేనని ఎర్రన్నాయుడు అన్నారు. అయితే అన్ని సమస్యలకూ రాజీనామా పరిష్కారం కాబోదని ఆయన చెప్పారు. ఈవిషయం ప్రధానికి కూడా బాగా తెలుసునని ఆయన అన్నారు. దేశం ప్రస్తుతం మున్న పరిస్థితిలో వాజ్పేయి వంటి నేత నాయకత్వాన్ని చేజార్చుకోవడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా వుండగా బిజెపి పార్లమెంటరీ పార్టీ, ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు తన నాయకత్వంపై సంపూర్ణవిశ్వాసం వ్యక్తం చేసిన కారణంగా నాయకత్వంలో కొనసాగుతున్నట్టుగా ప్రధాని వాజ్పేయి బుధవారం నాడు లోక్సభలో ప్రకటించారు.
విపక్ష
సభ్యులు
లేవనెత్తిన
ప్రశ్నకు
సమాధానంగా
ప్రధాని
ఈవిషయం
చెప్పారు.
ఎస్పి
నేత
ములాయం
సింగ్
యాదవ్,
రాష్ట్రీయ
జనతాదళ్
నేత
రఘవంశ్ప్రసాద్,
ప్రధాని
రాజీనామావిషయాన్ని
సభలో
లేవనెత్తారు.
ఈ
విషయంపై
ప్రజల్లో
నెలకొన్న
ఆయోమయాన్ని
తొలిగించాలని
ప్రధానిని
వారుకోరారు.
రాజీనామా
విషయంపై
సభ్యులకు
కలిగించిన
అసౌకర్యానికి
క్షమించాలని
వాజ్పేయికోరారు.
ఈ
సందర్భంగా
తన
సహజశైలిలో
ఆయన
బర్సాత్కా
మౌసమ్
హై,
బాదల్తో
గిరేగీ,
లేకిన్
బదాల్
చెలింగే
భీ....(ఇది
వర్షాకాలం
మేఘాలు
రావడం
సహజం,
అయితే
మేఘాలు
వెళ్లిపోతాయి
కూడా
)
అని
వ్యాఖ్యానించారు.
- రాజీనామా యోజనకు వాజ్ పేయి స్వస్తి
- రాజీనామా చేయాలనుకున్నాఃవాజ్ పేయి
-
ఎన్డిఎ
సమావేశానికి
శివసేనగైర్హాజరు