పాక్ పర్యటనకు హురియత్ పట్టు
శ్రీనగర్: పాకిస్తాన్ పర్యటనకు తమకు అనుమతి నివ్వాలని జమ్మూకాశ్మీర్కు చెందిన ఆల్పార్టీహురియత్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేసింది. కాశ్మీర్ ప్రజల ప్రమేయం లేకుండా భారత్, పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసిన కాశ్మీర్ సమస్య పరిష్కారం సాధ్యం కాదని హురియత్ నేతలు పేర్కొన్నారు.
పంజాబ్, నాగాలాండ్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమస్యలూ,సంక్షోభాలు తలెత్తినప్పుడు అనివార్యంగా స్థానిక ప్రజల ప్రమేయంతోనే వాటిని పరిష్కరించిన భారత ప్రభుత్వం కాశ్మీర్విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నదని వారు దుయ్యబట్టారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలకు తాము నిద్ధంగా వున్నామని అయితే అర్ధవంతమైన నిర్మాణాత్మక చర్చలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారుకోరారు. కేంద్రం దూతగా వున్న కెసి పంత్తో చర్చల వల్ల కాలయాపన తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని తాము భావిస్తున్నట్టుగా వారు చెప్పారు.