వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లకు వ్యతిరేకంగా గాంధీభవన్‌ ముట్టడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃకాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రికోట్ల విజయభాస్కర రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలనికోరుతూ వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలుశుక్రవారం గాంధీభవన్‌ ను ముట్టడించారు.త్వరలో రాష్ట్రానికి వచ్చే ఎఐసిసి ప్రతినిధినికర్నూలు పంపుతామని, దోషులు ఎంతటి వారైనాచర్యలు తీసుకుంటామని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయరావు హామీ ఇవ్వడంతో కార్యకర్తలుశాంతించారు. సి.డబ్యూ.సి. నేత ఆర్‌.కె. ధావన్‌సొంతపనిపై శుక్రవారం హైదరాబాద్‌ వచ్చినసందర్భంగా ఈ సంఘటన జరగడం విశేషం.

ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమైన కోట్లవిజయ భాస్కరరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ వేలాది మంది కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌ చేరుకున్నారు. బాణాసంచా కాలుస్తూ, కోట్లకు వ్యతిరేకంగాపెద్ద ఎత్తున నినాదాలిస్తూ గాంధీభవన్‌ లోకి దుసుకువెళ్ళేందుకు ప్రయత్నించారు. దీనితో ధావన్‌ తో సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెస్సార్‌, వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి బయటకు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని హామీ ఇవ్వడంతా వారు శాంతించారు.

కర్నూలు కాంగ్రెస్‌ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు గాంధీభవన్‌ ముట్టడి నిర్వహించారు. కోట్లవిజయభాస్కరెడ్డి, జిల్లాం కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌ రెడ్డి, రాంభూపాల్‌ చౌదరి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై జిల్లాలో కాంగ్రెస్‌ ఓటమికి కారకులయ్యారని వారు ఆరోపించారు. కోట్లను పార్టీ నుంచి బహిష్కరించకపోతే జిల్లాలోపెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీసీనియర్‌ నేతపై ఈ విధమైన ఆరోపణలు రావడం కాంగ్రెస్‌ పార్టీలో కలకలం సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X