వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫూలన్ కేసులో మరో ముగ్గురిఅరెస్టు
న్యూఢిల్లీ : ఫూలన్దేవి హత్యకేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకునిగా భావిస్తున్న షేర్సింగ్ రాణాకు ఆయుధాలు సప్లయ్చేసినట్టుగా భావిస్తున్న అమిత్ రాఠీ అనే వ్యక్తి అతనికి సన్నిహితుడైన ప్రవీణ్ మిట్టల్ను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిద్దరితో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను దాచిపెట్టిన ఆరోపణలతో కేశవ్చౌహాన్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులుఅరెస్టు చేశారు. ఈ అరెస్టులతో ఫూలన్ హత్యకేసులోఅరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరుకున్నది. ఉత్తరప్రదేశ్లోని వేరువేరు ప్రాంతాల్లోఅరెస్టు చేసిని ఈ ముగ్గురిని కూడా రాజధానిలోని కోర్టులోహాజరుపర్చారు.
Comments
Story first published: Friday, August 3, 2001, 23:53 [IST]