యుటిఐపై జెపిసిదర్యాప్తు
న్యూఢిల్లీ:యూనిట్ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంక్షోభంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీదర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించింది.సంక్షోభంపై గురువారం నాడు సభలో దుమారం సృష్టించిన ప్రతిపక్షాలు శుక్రవారం నాడు కూడాపెద్దఎత్తున గొడవ చేశాయి. ఆర్ధిక మంత్రియశ్వంత్సిన్హా రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు గొడవ ప్రారంభించినవిషయం విదితమే. గురువారం నాడు ప్రతిపక్షాలుప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం మూజువాణిఓటుతో వీగిపోయినప్పటికీ శుక్రవారం నాడు కూడాజీరో అవర్లో మళ్లీ ఇదే అంశాన్ని కాంగ్రెస్ సభ్యులులేవనెత్తారు.
అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలతో అడ్డుపడటంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. యుటిఐసంక్షోభంపై దర్యాప్తునకు ప్రత్యేక జెపిసి ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ ప్రస్తుతం స్టాక్మార్కెట్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న జెపిసికే ఈ వ్యవహారం కూడాఅప్పగించాలని సూచించారు. దీనిపై కొద్దిసేపు వాగ్యుద్ధం తర్వాత అధికార, ప్రతిపక్ష సభ్యులస్పీకర్ నిర్ణయాన్ని తాము ఔదలదాల్చడానికి సిద్ధంగా వున్నట్టుగా చెప్పారు.స్పీకర్ రెండు పక్షాలతో విడిగా మాట్లాడిన తర్వాత స్టాక్మార్కెట్పై దర్యాప్తు చేస్తున్న జెపిసికే ఈ పనికూడాఅప్పగించాలని నిర్ణయించారు.