వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో 17 మందిఊచకోత

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌:జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లా సరోప్త్కర్‌ గ్రామానికిచెందిన 17 మందిని కాశ్మీర్‌ తీవ్రవాదులు దారుణంగా కాల్చిచంపారు. ఈ గ్రామం నుంచి శుక్రవారం రాత్రి 18 గ్రామస్తులను తీవ్రవాదులు అపహరించుకుపోయారు.

వారిలో17 మందిని శనివారం ఉదయం దారుణంగా కాల్చిచంపారని పోలీసులు ప్రకటించారు. అపహరణకు గురయినవారు, మృతులు అంతా హిందూమతానికి చెందినవారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ వివరాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన గురించి తెలిసిన వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలను దోడా జిల్లాకు తరలించి గాలింపు చర్యలు ప్రారంభించారు. గత రాత్రి గ్రామస్తులను అపహరించుకుపోయే ముందు తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి.

తీవ్రవాదులకు దీటైన జవాబుః అద్వానీ
కాశ్మీర్‌ లో అమాయకులైన ప్రజలను పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు ఊచకోత కోయడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్‌.కె. అద్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శనివారం ఆయన మహారాష్ట్రలో ఒక కార్యక్రమంలోవిలేకరులతో అన్నారు. ఈ ఘాతుకానికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X