వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంచాయతీ తొలి ఘట్టం పూర్తి
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇరవై వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. ఆఖరు రోజు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలవుతున్నట్టుగా జిల్లాలనుంచి సమాచారం అందింది.
ఉగ్రవాదం, ఫాక్షనిజం వున్న జిల్లాల్లో ముందు జాగ్రత్తగా నామినేషన్లను మండల కేంద్రాల్లోస్వీకరిస్తున్నారు. సోమవారం నాడు నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత బుధవారం వరకు ఉపసంహరణకు అవకాశం వుంటుంది. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. 14,17,20వ తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరుపుతారు.
Comments
Story first published: Saturday, August 4, 2001, 23:53 [IST]