వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిఐ చైర్మన్‌గా జయచంద్రారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రారెడ్డి బాధ్యతలు చేపడుతారు. ప్రస్తుత చైర్మన్‌ పిబి సావంత్‌ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ జస్టిస్‌ జయచంద్రారెడ్డి నియామకాన్ని ఖరారు చేసింది. కృష్ణకాంత్‌ చాంబర్‌లో ఈ సమావేశం జరిగింది.

లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబాల్‌ ఈ కమిటీలో సభ్యులుగా వున్నారు. కడప జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో జన్మించిన జయచంద్రారెడ్డి మదనపల్లి బీటీ కాలేజీలో డిగ్రీ చదివారు. మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి లా పూర్తి చేశారు. లాయర్‌గా కొంతకాలం ప్రాక్టీస్‌ చేసిన తర్వాత 1975లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1989లో సుప్రీకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. క్రిమినల్‌ లా లో ఆయనకు అపారమైన అనుభవం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X