వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుసాయంపై వాజపేయితో బాబు భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కరవుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ కు సత్వరం సాయంఅందించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కేంద్ర ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి వాజ్‌పేయి, వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులను కలుసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితిని చంద్రబాబు నాయుడు వాజ్‌పేయికి వివరించారు.

కరవు నివారణ చర్యలకు 849 కోట్ల రూపాయల సాయంఅందించాల్సిందిగా అయన వాజ్‌ పేయిని కోరారు. కరవు తీవ్రతతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు ప్రధానికివివరించారు. ధాన్యానికి ఇచ్చే కనీస మద్దతు ధరనుపెంచాలని, వివిధ శాఖల నుంచి అడ్వాన్సులు ఇప్పించాలని చంద్రబాబు నాయుడు ప్రధానినికోరారు. విజ్ఞప్తులను పరిశీలించి సత్వర సాయంఅందజేస్తామని వాజ్‌ పేయి హామీ ఇచ్చినట్లు చంద్రబాబు ఆ తరువాతవిలేకరుల సమావేశంలో చెప్పారు.

అనంతరం చంద్రబాబు నాయుడు హర్యానా, పంజాబ్‌ ముఖ్యమంత్రులను కలుసుకొని వ్యవసాయ విధానాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హాను కూడా చంద్రబాబు కలుసుకున్నారు. ప్రపంచ బ్యాంక్‌ నుంచి రావలసిన రెండు వేల కోట్ల రూపాయల నిధుల మంజూరికి వున్న అవరోధాలను తొలగించాల్సిందిగా చంద్రబాబు యశ్వంత్‌ సిన్హానుకోరారు.

వివిధ శాఖల మంత్రులను కూడా కలుసుకున్న చంద్రబాబు శుక్రవారం కూడా పలుశాఖల మంత్రులను కలుసుకుంటారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్‌ తిరిగి చేరుకుంటారు.

  • ధాన్యం మద్దతుధర పెంచండిః బాబు
  • కరవు సాయంపై ప్రధానికి వై.ఎస్‌. లేఖ
  • సాయంకోసం బాబు ఢిల్లీ యాత్ర
  • సాయంపై పెదవి విప్పని కేంద్రబృందం
  • కరవు బృందానికి కన్నీటి స్వాగతం
  • కరవుబృందాన్ని నిలదీసిన రైతులు
  • వచ్చే వారం కరవు నివేదిక
  • వెయ్యికోట్లకు లెఫ్ట్‌ డిమాండ్‌
  • కరవు మండలాలకు బాబు ప్యాకేజ్‌
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X