వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ మృతుల్లో ఆంధ్రుడు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ ః జమ్మూ రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకున్నది. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కుచెందినవారు వున్నట్టుగా తెలిసింది. వివరాలు వెల్లడికాలేదు.

ఇదిలా వుండగా లఢక్‌ మినహా జమ్మూకాశ్మీర్‌ను కల్లోల ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నది. కాగా కాశ్మీర్‌లో మహిళలు బురాఖా లేకుండా రోడ్డుపైకి రాకుడదని ఆదేశాలు జారీ చేశారు. కాశ్మీరీ స్త్రీపురుషులు తాము జారీ చేసిన ఆదేశాల మేరకు డ్రెస్‌ కోడ్‌ పాటించాలని హెచ్చరిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిసాయి. బురఖాలు లేకుండా వెళ్లుతున్న విద్యార్ధినులపై తీవ్రవాదులుగా భావిస్తున్న కొందరు రసాయనాలతో దాడులు జరపడంతో యువతీయువకుల్లో తీవ్ర ఆందోళన అలుముకున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X