కాకర్లపై పార్వతి దావా
హైదరాబాద్: ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివంగత ఎన్టీరామారావు భార్య, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి బుధవారం క్రిమినల్ కోర్టులో కేసు వేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సుబ్బారావు తన పుస్తకంలో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆమె ఈ కేసు దాఖలు చేశారు. సిఆర్పిసిసెక్షన్ 200 ఐపిసి సెక్షన్ 500 నిబంధన ప్రకారం కాకర్ల సుబ్బారావుపై చర్య తీసుకోవాలంటూ లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాదికె.ఆర్. రామన్ ఐదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వద్ద ఈ కేసు దాఖలు చేశారు. లక్ష్మీపార్వతి కూడా కోర్టుకుహాజరై తన వాదనను వినిపించారు.
ఎన్టీఆర్ మరణించిన ఐదేళ్ల తర్వాత కాకర్ల తన పుస్తకంలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్టీఆర్ ప్రతిష్టకు, తన గౌరవానికి భంగం కలిగించారని ఆమెవిమర్శించారు. ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఏనాడూ అడగని కాకర్ల ఇప్పుడు ఎన్టీఆర్కు సకాలంలో వైద్యంఅందలేదని చేసిన వ్యాఖ్యలు అబద్ధాలని ఆమె అన్నారు. కాకర్ల ఫిజిషియన్ గానీ, కార్డియాలిజిస్టు గానీ కారని, రేడియాలజిస్టు మాత్రమేనని ఆయన అన్నారు. 1996 జనవరి 17వ తేదీ రాత్రి ఎన్టీఆర్ ఆరోగ్యం క్షీణించిన వెంటనే తాను ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సోమరాజుకు, ఇతర వైద్యులకు ఫోన్ చేసి చెప్పానని, వారు వెంటనే వచ్చారని,అప్పటికే ఎన్టీఆర్ మరణించారని ఆమె వివరించారు. కేసువిచారణకు స్వీకరించేది లేనిదీ ఈ నెల 17వ తేదీన తెలియజేస్తానని మెజిస్ట్రేట్ చెప్పారు.