వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ సర్కారుకు తెలుగుదేశం చురకలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ గురువారం రాజ్యసభలో వాజ్‌పేయి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిఅందరినీ ఆశ్చర్య పరచింది. తెలుగుదేశం పార్టీఎం.పి. సి. రామచంద్రయ్య ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై సునిశితంగావిమర్శలు చేశారు. కాశ్మీర్‌ లో నరమేధం జరుగుతున్నా కేంద్రహోం శాఖ మంత్రి ఎల్‌. కె. అద్వానీ చలనం లేకుండా వున్నారని, ఆయన మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ కూటమిలో సవాలక్ష వైరుధ్యాలున్నాయని అటువంటప్పుడు ప్రవర్తనా నియమావళి రూపకల్పనలోఅర్థం లేదని రామచంద్రయ్య పరోక్షంగా ఎన్డీఏ వైఖరినివిమర్శించారు.

అఖండ భారతం నినాదంతో బిజెపి గద్దెను ఎక్కిందని అయితే కాశ్మీర్‌ లో ఐదు దశాబ్దాల నాటిసైనిక చట్టాన్ని తిరగదోడడం ద్వారా ప్రజల ఆశలను బిజెపి వమ్ముచేసిందని రామచంద్రయ్య బిజెపికి చురకఅంటించారు. ఎన్డీఏ కూటమికి చెందిన వారు వాజ్‌పేయిని ఇబ్బందులకు గురి చేస్తుండగా తెలుగుదేశం పార్టీ మాత్రం వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నప్పటికీ ఆయనకు కొండంత అండగా నిలబడింది. అటువంటిది ఎన్డీఏ నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీపెద్దల సభలో గళం విప్పడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X